యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

ఐవీఆర్

శనివారం, 31 మే 2025 (19:00 IST)
ప్రేమ అనేది ఇదివరకు పెళ్లికాని ఇద్దరు యువతీయువకుల మధ్య తలెత్తి అది సన్నిహిత సంబంధం, పెళ్లికి దారి తీసేది. ఐతే ఇప్పుడు చాలాచోట్ల వెలుగుచూస్తున్న సంబంధాలు వివాహేతర సంబంధాలుగా వుంటున్నాయి. పెళ్లయిన పురుషుడు లేదా స్త్రీ పెళ్లికాని వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అశోక్ నగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో నివాసం వుండే ఓ వివాహితకు ఇద్దరు పిల్లలున్నారు.
 
ఐతే ఈమెకి ఫేస్ బుక్ ద్వారా స్వామి అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారితీసింది. వీలున్నప్పుడల్లా అతడు వివాహితతో రాసలీలల్లో మునిగితేలడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గమనించిన కాలనీవాసులు వారిద్దర్నీ పట్టుకుని బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి చేసారు. అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ బుద్ధి చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసారు.
 
భారతదేశంలో వివాహేతర సంబంధాలు, లేదా వ్యభిచారం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతంలో వ్యభిచారాన్ని నేరంగా పరిగణించిన భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497ను సుప్రీంకోర్టు 2018లో కొట్టివేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు