పోలీసుల కథనం మేరకు.. కర్నాటక రాష్ట్రంలోని బెళగావి ప్రాంతానికి చెందిన ఓ నిందితుడు ఓ బాలికకు మంచి స్నేహితుడు. ఆరు నెలల క్రితం తన స్నేహితుడు పిలవడంతో బాలిక అతనితో కలిసి ఓ కొండ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఆ 15 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను నిందితులంతా తమతమ ఫోన్లలో చిత్రీకరించారు.
తమ మాట వినకపోతే ఆ వీడియోను ఆన్లైన్లో పెడతామంటూ బెదిరించి తాజాగా మరోసారి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈసారి కూడా ఈ కిరాతక చర్యను రికార్డు చేసి బెదిరింపులు కొనసాగించారు. దీంతో బాలిక శనివారం పోలీసులను ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, మిగిలిన పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.