నగ్నంగా వీడియో.. సీనియర్ సిటిజన్‌కు లక్షల్లో నష్టం

గురువారం, 28 డిశెంబరు 2023 (16:51 IST)
పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం కారణంగా, సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్- వివిధ సోషల్ మీడియాలలో పెరుగుతున్నారు. లైంగిక వేధింపులు, అశ్లీలత, మార్ఫింగ్, మోసాలు పెరిగిపోతున్నాయి. నవీ ముంబైలో అలాంటి షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
సోషల్ మీడియా స్నేహం నవీ ముంబై ప్రాంతంలోని ఒక సీనియర్ సిటిజన్‌కు ఎంతో నష్టాన్ని మిగిల్చింది. నిందితుడు వాట్సాప్ ద్వారా సీనియర్ సిటిజన్‌ని సంప్రదించి వీడియో కాల్‌లో నగ్నంగా ఉండేలా ప్రేరేపించాడు. వీడియో కాల్‌ను రికార్డ్ చేసి వైరల్ చేస్తానని బెదిరించి సీనియర్ సిటిజన్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు.
 
వీడియో వైరల్ అవుతుందనే భయంతో బాధిత పౌరుడు నిందితులు చెప్పిన విధంగా రూ.43 లక్షల 22 వేల 900లను వివిధ బ్యాంకు ఖాతాలకు పంపించాడు. అయితే ఆ తర్వాత కూడా నిందితులు పదే పదే బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించడంతో చివరకు బాధిత సీనియర్ సిటిజన్ నవీ ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
పోలీసులు వెంటనే విచారణ జరిపి రాజస్థాన్‌లోని డిగ్ జిల్లా పాల్డి గ్రామంలో నివసిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని నుండి చాలా మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు