అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. భర్తను కడతేర్చిన భార్య

శుక్రవారం, 15 అక్టోబరు 2021 (12:44 IST)
అక్రమం సంబంధాన్ని అడ్డుగావున్నాడనీ భావించిన ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ దారుణం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ధర్మారం తండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్‌ శేఖర్‌ (30)కు అదే ప్రాంతానికి చెందిన ముడావత్‌ జ్యోతి (26)కు పదేళ్ల క్రితం వివాహమైంది. 
 
ఈ దంపతులు మూడేళ్ల క్రితం గచ్చిబౌలి గోపన్‌పల్లి తండాకు వలస వచ్చారు. శేఖర్‌ మేస్త్రీ పనిచేస్తుండగా జ్యోతి కూలి పనిచేస్తుండేది. ఈ క్రమంలో రామచంద్రాపురం ఉస్మాన్‌ నగర్‌కు దుడ్డెల మాణిక్యం(42) తెల్లాపూర్‌కు చెందిన రాజీవ్‌ రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
 
రాజీవ్‌ రెడ్డి ఇటీవల తెల్లాపూర్‌లో రెండు విల్లాలు కొనుగోలు చేశాడు. అందులో పనుల కోసం శేఖర్‌ దంపతులు వెళ్లడంతో మాణిక్యంకు వారితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతను శేఖర్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 
 
శేఖర్‌ తరుచూ తనను కొడుతుండటంతో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన జ్యోతి ప్రియుడితో కలిసి అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 10న సాయంత్రం 6 గంటలకు శేఖర్‌కు ఫోన్‌ చేసి మద్యం తాగేందుకు ఆహ్వానించాడు. 
 
పురుగు మందు కలిపిన మద్యాన్ని తాగించి గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా నిందితుడితోపాటు మృతుడి భార్యను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు