ఈ క్రమంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్షయను.. ఆమె తమ్ముడిని చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది అక్షయ.
ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ అక్షయ మృతి చెందింది. అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి, వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మనోజ్ను అదుపులోకి తీసుకున్నారు.