భార్యపై దుండగుల మూక అత్యాచారం.. ఆ తర్వాత భర్తతో కలిసి ఆత్మహత్య

ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (11:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆ ఆమె తన భర్తతో కలిసి విషం తీసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో జరిగింది. ఈ కేసు వివారలను పరిశీలిస్తే, 
 
బస్తీ జిల్లాలో భార్యాభర్తలు ఉన్నారు. వీరిలో భర్తకు 30 యేళ్లు, భార్యకు 27 యేళ్లు. ఈ నెల 20వ తేదీ అర్థరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు బాధితారులి ఇంట్లోకి చొరబడి భర్తను కట్టేసి, ఆయన కళ్లెదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే భర్తతో కలిసి భార్య విషం సేవించింది. వీరిలో భర్త అదే రోజు మరణించగా, బాధితురాలు మాత్రం గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది.
 
అయితే, వీరు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఓ వీడియోలో నిందితుల పేర్లను వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదర్శ్ (25), త్రిలోకి (45) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. అత్యాచారానికి, బాధితుల భూమి అమ్మకానికి సంబంధం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు