భార్య నిద్రపోగానే కుమార్తెపై అత్యాచారం.. ఏడాదిన్నరగా ఫిజియోథెరపిస్టు అరాచకం

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:44 IST)
విజయవాడ నగరంలో ఓ దారుణం వెలుగుచూసింది. భార్య నిద్రపోయిన తర్వాత లేదా భార్య ఇంట్లో లేనపుడు కుమార్తెపై కన్నతండ్రి లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. ఈ దారుణం గత యేడాదిన్నరగా సాగుతూ వస్తోంది. కన్నతండ్రి లైంగికదాడిని భరించలేని ఆ బాలిక... తన అమ్మమ్మ ఇంటికి వెళతానని మొండిపట్టుపట్టింది. దీంతో ఏం జరిగిందని తల్లి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన కన్నతండ్రి స్థానికంగా ఓ ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ, అజిత్‌ సింగ్‌ నగర్‌‌లో నివాసముంటున్న ఫిజియోథెరపిస్టు (35)కు కుమార్తె (13), కుమారుడు (11) ఉన్నారు. కుమార్తె ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. గత ఏడాది మార్చి నెల నుంచి కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. 
 
భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య ఇంట్లో లేనప్పుడల్లా కుమార్తెపై అత్యాచారం చేయసాగాడు. ఈ నెల 8, 10వ తేదీల్లోనూ కూతురిపై అత్యాచారం చేయడంతో బాలిక భరించలేకపోయింది. తాను ఇక్కడ ఉండలేనని అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోతానని తల్లికి చెప్పింది. 
 
దీంతో ఏం జరిగిందని తల్లి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసిన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నివాస ప్రాంతాన్ని విజయవాడ నార్త్‌ జోన్‌ ఎసిపి షేక్‌ షాను, సిఐ లక్ష్మీనారాయణ పరిశీలించారు. పోక్సో యాక్టు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు