ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షా, ప్రధానితో భేటీ అవుతారా?

శనివారం, 3 జూన్ 2023 (10:07 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఢిల్లీలో చంద్రబాబు పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని టాక్ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం వుందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు