ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. కాల్ మనీ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే రోజమ్మపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు స్పీకర్ కోడెలను విజ్ఞప్తి చేశారు.
రోజాపై సస్పెన్షన్ వేటును ఈ అసెంబ్లీ సెషన్స్ వరకు పరిమితం చేయాలని విష్ణు కుమార్ రాజు కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రోజా సస్పెన్షన్పై స్పీకర్ కోడెల ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని.. ఇకపై రోజాపై సస్పెన్షన్కు సంబంధించి అసెంబ్లీ లేదా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.