మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మరణం మరోమారు మీడియలో ప్రాధాన్యత సంతరించుకుంది. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు ఎయిమ్స్ పోర్సెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేశాయి. ఫలింతా సునందా పుష్కర్ మృతి చుట్టు తాజాగా వివాదం ముసురుకుంది. సునంద, ఆమె మృతి వెనుక కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి.
* ఇపుడు సునందా పుష్కర్ది సహజమరణమంటూ నివేదిక ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు, పరువురు యూపీఏ కేంద్ర మంత్రులు ఒత్తిడి తెచ్చినట్టు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో సునందా పుష్కర్ మరణం మరోమారు వార్తలకెక్తింది.