కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ.. రెండు కప్పులు తురిమిన పచ్చికొబ్బరి... రెండు కప్పులు పంచదార... ఒకటిన్నర కప్పు నెయ్యి... అర కప్పు జీడిపప్పు.... వంద గ్రాములు కిస్మిస్లు... రెండు టీస్పూన్లు యాలకుల పొడి... పావు టీస్పూన్
తయారీ విధానం : మొదట దళసరిగా ఉండే మూకుడులో రవ్వను కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. చెక్కర కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలుకల పొడి చల్లి దించుకోవాలి.
తరువాత ఈ మిశ్రమంలోనే నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలను చేసేటప్పుడు కొద్ది కొద్దిగా పాలు చల్లుతూ ఉండలు చుట్టుకుంటే రుచిగా ఉండటమే గాకుండా, గుండ్రంగా కూడా వస్తాయి.