ఇజ్రాయెల్ బాంబులతో ఇరాన్పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా ఇరాన్లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్పై ఇజ్రాయేల్ మిసైల్తో దాడికి పాల్పడింది. ఈ దాడి జరుగుతుండగా యాంకర్ న్యూస్ చదువుతోంది. మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె పరుగులు తీసింది.
లైవ్ ప్రసారం జరుగుతుండగా బాంబు పడటంతో భయాందోళనలకు గురైన యాంకర్ పరుగులు తీసింది. ఈ దాడికి బిల్డింగ్ కదలడంతో కరెంట్ కట్ అయింది. ఇంకా ఈ ఘటనలో స్టూడియో పైకప్పు ధ్వంసమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.