నిత్యావసర ధరలే కాదు... వీటితోపాటు అన్ని ధరలూ పెరిగిపోయాయి. ఏటా ఎంతో ఆనందోత్సోహాలతో జరుపుకునే దీపావళిలో బాణాసంచాది ప్రధాన పాత్ర. అయితే వీటి ధరలు నింగికెగసాయి. వేయి రూపాయలు తీసుకెళితే కనీసం మూడు నాలుగు వెరైటీలు కూడా రావడం లేదు.
దీనితో ఏదో మొక్కుబడిగా రెండు మూడు వెరైటీలను కొనుగోలు చేస్తున్నారు. అదీ పిల్లల ఒత్తిడితోనే కొంటున్నారు తల్లిదండ్రులు. తెచ్చిన సరకు నత్తనడకన అమ్ముడుపోతుండటంతో దుకాణాదారులు డీలా పడుతున్నారు. మొత్తమ్మీద ఆర్థిక సంక్షోభం అన్నింటా వెలిగిపోతోంది. దీపావళి వెలుగులకు అడ్డు తగులుతోంది.