-అంటూ మహిళలు ప్రార్థిస్తూ ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి ప్రతీకలుగా భావించడం ఆనవాయితీ.
పంచభూతాలలో ప్రధానమైన అగ్ని... ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును ప్రసాదిస్తుంది. అలాంటి తేజస్సును, విజ్ఞానాన్ని, మనుగడను దీపాల వెలిగింపుతో పొందవచ్చునని ఆర్యుల విశ్వాసం. దీపావళి రోజున దీపాలను వెలిగిస్తే మూల్లోకాలను పరిపాలించే బ్రహ్మ, విష్ణువు, శివపరమాత్మలను పూజించినట్లవుతుందని పండితులు అంటున్నారు.
అంధతమిస్రంచమనేది ఒక నరకమని, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకునేందుకు ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయడం ఉత్తమైన కార్యంగా పెద్దలు భావిస్తున్నారు. అందుకే దీపావళి రోజున దీపాలను వెలిగిస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం.