కావలసిన పదార్థాలు : చక్కెర... ఒక కేజీ మైదా... అర కేజీ నెయ్యి... ఒక కేజీ అమూల్ మిల్క్ పౌడర్... పావు కేజీ యాలక్కాయల పొడి... పావు కేజీ నీళ్లు... తగినన్ని
తయారీ విధానం : మిల్క్ పౌడర్లో 150 గ్రాముల నెయ్యి వేసి కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి... సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్ద, మైదా, యాలక్కాయల పొడి వరుసగా వేసి కలపాలి.
ఇప్పుడు ఇంకొక పాత్రలో మిగిలిన నెయ్యి వేడి చేసి పంచదార, మిల్క్ పౌడర్ మిశ్రమంలో పోసి బాగా కలిపి వెడల్పాటి ట్రేలో పోయాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరచి ఆరు గంటలపాటు ఆరబెట్టాలి. ఆరిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా కోసి ఆరగించండి.