దీపావళి వచ్చేస్తోంది... దీపాలు ఎలా పెట్టాలో తెలుసా?

శనివారం, 26 అక్టోబరు 2019 (21:42 IST)
దీపావళి అక్టోబరు 28 న వస్తోంది. ఈ దీపావళి నాడు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను.. అలాగే విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడిని పూజించేందుకు ఈశాన్య లేదా ఉత్తర లేదా తూర్పు దిశవైపుగా ముఖాలు ఉండేలా ప్రతిష్టింపజేసుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంటి యందు అష్టైశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీపావళి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పాతబడిన, పనికిరాని వస్తువులను ఇంటి నుంచి పారేయడం ద్వారా కొత్త శక్తిని ఆహ్వానింపజేసుకోవచ్చు.
 
దీపావళి రోజున ఇంటిని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి.. మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల హారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. 
 
ఉత్తరం దిశలో కుబేర స్థానం సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకుంటారు. అలాగే అమర్చిన లాకర్‌లో లక్ష్మీదేవిని ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, సంపదలు వెల్లివిరుస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు