స్త్రీలను కష్టపెట్టే చోట లక్ష్మీదేవి ఉండదట!

FILE
ఎప్పుడూ తగాదాలు పడే వారి గృహంలో లక్ష్మీదేవి ఉండదట. సోమరితనం, ప్రయత్నం లేకపోవడం వంటి చర్యలు లక్ష్మీదేవి గృహం నుంచి వీడ్కోలు పలుకుతాయి. అలాగే స్త్రీలను కష్టపెట్టే చోట లక్ష్మి ఉండదని పండితులు చెబుతున్నారు.

పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, గోవులు వంటి లక్ష్మీ రూపాలే. దేవతారాధన, శుచి శుభ్రత, వేదవిహిత ధర్మ పాలన జరిగే ఇళ్ళల్లో లక్ష్మి ఉంటుంది. ధన, ధాన్యం కూడా లక్ష్మీదేవి రూపాలే. అలాగే ధనం, ధాన్యం, పూజాద్రవాలు, పెద్దలకు కాళ్ళు తగిలితే లక్ష్మికి కోపం వస్తుందని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా ప్రాత కాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్ళల్లో లక్ష్మి ఉండదు. పెద్దలను గౌరవించే ఇళ్ళల్లో, సహనం గల స్త్రీలు ఉండే ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుంది. రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటిరోజు ధరిస్తే లక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని పురోహితులు అంటున్నారు.

అందుచేత మీ గృహంలో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలంటే.. దీపావళి రోజున ఆ దేవిని పూజించాలి. సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకుని రంగవల్లికలతో అలంకరించుకుని.. లక్ష్మీదేవి పూజ చేసేవారింటికి లక్ష్మీదేవి వస్తుందని ప్రగాఢ విశ్వాసం. కాబట్టి లక్ష్మీదేవిని దీపావళి రోజున నిష్ఠతో స్తుతించి, ఆమె అనుగ్రహం పొందుదుముగాక..!.

వెబ్దునియా పై చదవండి