జై గంగా భవానీ... వారాణిసి గంగలో కేజ్రీవాల్ మునక... పైకి కోడుగుడ్లు

మంగళవారం, 25 మార్చి 2014 (13:17 IST)
FILE
అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారి కమిట్ అయితే ఇక ఆయన మాట ఆయనే వినడు. భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసి నియోజకవర్గంలో పోటీకి దిగుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో కేజ్రీవాల్ ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. వారణాసిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంతకుముందు గంగానదిలో స్నానమాచరించి గంగాదేవి తమ పార్టీ గెలుపుకు ఆశీర్వాదాలు ఇస్తుందని అన్నారు.

గుజరాత్ రాష్ట్రంలో మోడీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నారు. దీంతో కొందమంది ఆందోళకారులు అరవింద్ కేజ్రీవాల్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్ల వర్షం కురిసింది. దాంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. వారణాసిలో నరేంద్ర మోడిని ఓడించేందుకు కేజ్రీవాల్ నిజంగానే బరిలో నిలుస్తారా... చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి