పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక నా రాజకీయ శత్రువే : చిరంజీవి

శుక్రవారం, 21 మార్చి 2014 (09:52 IST)
File
FILE
తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని, అందువల్ల ఆయన ఇతరుల తరహాలోనే రాజకీయ శత్రువని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపే ఎవరైనా నాకు శత్రువులతో సమానమన్నారు.

మరోవైపు.. సీమాంధ్రలో ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించే బాధ్యత తీసుకొన్న చిరంజీవికి ఇది ఊహించని పెను సవాలుగా మారింది. అందుకే ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పలేదు. ఒకవేళ ఇప్పటికీ ఆయన మాట్లాడకపోయినట్లయితే, ఆయనను కాంగ్రెస్ పార్టీ శంఖిస్తుంది గనుకనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

పవన్ జనసేనపై చిరంజీవి స్పందిస్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ వేరే పార్టీ పెట్టుకొన్నాడు గనుక ఇకపై నేను కూడా అతనిని మా రాజకీయ ప్రత్యర్థిగానే భావించి ఎదుర్కొంటాను. కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలను ఏవిధంగా ఎదుర్కొంటుందో తమ్ముడి జనసేనను కూడా అదేవిధంగా ఎదుర్కొంటుంది. నేటికీ నా అభిమానులు, ప్రజలు అందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని నమ్ముతున్నాను.

అందువల్ల అతను పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని చెప్పినంత మాత్రాన్న మేమేమి భయపడటం లేదు. సమాజసేవ చేయాలనే తలపుతో అతను రాజకీయాలలో ప్రవేశించి పార్టీ స్థాపించాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం పూర్తిగా అతని వ్యక్తిగత విషయం గనుక నేనేమి ఆ విషయంలో కలుగజేసుకోను. కానీ, తమ్ముడికి ఎల్లపుడూ నా ఆశీస్సులు ఉంటాయి అని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి