వాగ్ధాటి కాదు... చురుగ్గా వ్యవహరించే నాయకత్వం కావాలి... మా తెలంగాణ పార్టీ

గురువారం, 20 మార్చి 2014 (20:04 IST)
WD
తెలంగాణ పునర్నిర్మాణం పేరిట అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న నాయకులు అసలు ఎంత చురుగ్గా వ్యవహరించే వీలుందో వారి పనితీరును బట్టి ప్రజలు అంచనా వేసుకోవాలని మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు కె.వీరారెడ్డి పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెరాస అధినేత కేసీఆర్ చెపుతున్న తెలంగాణ పునర్నిర్మాణం ఆచరణలో ఏమేరకు సాధ్యమవుతుందో ప్రజలు అంచనా వేసుకోవాలని సూచించారు.

పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఆసక్తిని కేసీఆర్ చూపలేదన్నారు. మా తెలంగాణ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపేవారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. మహిళలకు 50, యువతకు 40, అనుభవజ్ఞులకు 10 శాతం చొప్పున టిక్కెట్లు కేటాయించేందుకు మా తెలంగాణ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుభద్రారెడ్డి, సభ్యులు షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి