సీఎంలా కెసిఆర్... మల్కాజ్ గిరి లోకసభ... గజ్వేల్ అసెంబ్లీ... వదిలేస్తే...

మంగళవారం, 25 మార్చి 2014 (12:07 IST)
WD
వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో తెరాస గెలిచేసి ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయిపోయినట్లు మాట్లాడేస్తున్నారు. అంతేకాదు ఆయన మల్కాజిగిరి నియోజకవర్గం లేదంటే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాలలో ఏదేని ఒక స్థానం నుంచీ, అదేవిధంగా గజ్వేల్ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయాలని కసరత్తు చేస్తున్నారట.

వ్యవహారం చూస్తుంటే ఆయన సీఎం గానే కాదు... కుదిరితే పీఎం సీటు పైనైనా కూర్చునేందుకు గల అవకాశాలను చూస్తారని కూడా అంటున్నారు. అనుకున్నట్లే మొత్తం 18 పార్లమెంటు స్థానాలను తెరాస కైవసం చేసుకుంటే ప్రధానమంత్రి పీఠంపైన కూడా డిమాండ్ చేస్తారని కొంతమంది చర్చించుకోవడం విశేషం.

మొత్తమ్మీద తెలంగాణలో ఇక తెరాస తప్పితే మరే పార్టీ రాదని కెసిఆర్ గట్టిగా నమ్ముతున్నట్లు కనబడుతున్నారు. చూడాలి 2014 ఎన్నికల నాటికి కెసిఆర్ ఇంకెన్ని వ్యూహాలు బయటపెడతారో...?

వెబ్దునియా పై చదవండి