''ఉండ్రాళ్ల తద్దె'' వ్రతం ఎలా చేయాలో తెలుసా..?

గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:30 IST)
ఈ రోజున ఉండ్రాళ్ల తద్దె. ఉండ్రాళ్ల తద్దె అంటే వ్రతం. ఈ వ్రతాన్ని గురించి పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి వివరించారు. పరమేశ్వరుడు లోకానికి ఆదిదేవుడు. పార్వతీదేవి శివుని తన భర్తగా పొందాలని స్వామివారికి తపస్సు చేస్తుంది. తపస్సు పూర్తయిన తరువాత భాద్రపద మాసం బహుళ తదియనాడు ఈశ్వరుడు పార్వతీదేవిని తన భార్యగా స్వీకరించాడు.
  
 
ఉండ్రాళ్ల తద్దె (సెప్టంబరు 27) వ్రతం మహిళలు ఆచరిస్తే సకల సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని పార్వతీ వరమిచ్చారు. ఈ వ్రతాన్ని రెండురోజుల పాటు ఆచరించాల్సి ఉంటుంది. అంటే తదియ ముందు విదియ రోజున విఘ్నేశ్వరుని పూజించి కుడుములను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. మెుదటి రోజు అంటే తదియ నాడు సాయం కాలం వేళలో మహిళ ముత్తయిదువులను ఈ వ్రతానికి ఆహ్వానించాలి. 
 
తదియ నాడు మధ్యాహ్నం వేళలో అమ్మవారిని పూజిస్తూ ఉత్తరేణి మెుక్కకు నమస్కరించాలి. దుర్గాదేవికి 16 ఉండ్రాళ్లను సమర్పించాలి. వ్రతానికి వచ్చిన ముత్తయుదువులకు చీర, ఉండ్రాళ్లు, తాంబులాను వాయినంగా ఇవ్వాలి. ఈ ఉండ్రాళ్ల తద్దె వ్రతాన్ని పదహారు కుడుముల నోము, షోడశోమావ్రతం అని కూడా పిలుస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు