2021లో ఈ నగరం ఎఫైర్ హత్యల్లో అగ్రస్థానం

సోమవారం, 27 డిశెంబరు 2021 (15:20 IST)
దేశంలో చాలావరకు లాక్ డౌన్ నుంచి బయటకువచ్చింది. దీనితోపాటే నేరాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. దేశంలో సంపూర్ణ కేసుల పరంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక హింసాత్మక నేరాలు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో 15.2% (4,28,134 లో 65,155) కేసులు ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. ఇక మహారాష్ట్ర (10.7%), బీహార్-పశ్చిమ బెంగాల్ కేసులలో 10.4%గా నమోదయ్యాయి.

 
ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం, హింసాత్మక నేరాలకు సంబంధించి లక్ష జనాభాకు 25.0 చొప్పున నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నాయి. ముంబైలో 184, పూణేలో 50.5 చొప్పున నమోదయ్యాయి. నాగ్‌పూర్, సూరత్‌లలో ఢిల్లీ తర్వాత శృంగార సంబంధాలపై దేశంలో అత్యధిక హత్యలు జరిగాయి. మొత్తమ్మీద ఎఫైర్ల కారణంగా ఢిల్లీలో అత్యధికంగా హత్యలు జరిగినట్లు తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు