అల్పాహారం తరచూ మానేయడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి మెదడుకి సరైన పోషకాలు అందవు. దాంతో అది చురుగ్గా పనిచేయదు. తినకపోవడం ఎంత చేటో, అతిగా తినడమూ అంతే చేటు . అతిగా తినడం వల్ల మెదడుకు సంబంధించిన నాళాలు మొద్దుబారి, మెదడు చురుగ్గా పని చేయలేదు.
అదీ కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడూ శరీరం సహకరిస్తోందని పనిచేస్తుంటాం.. కానీ మెదడు పని చేయవద్దని సంకేతాలిస్తే ఆ పని ఆపేయడం మంచిది. లేదంటే తీవ్ర అలసటకూ, అనారోగ్యానికి గురవుతాం. మెదడులోని కణాలు నిర్వీర్యమై పనిచేయడం మానేస్తాయి.