కొవ్వు కరగాలంటే.. పరగడుపున బొప్పాయి తినాల్సిందే..

మంగళవారం, 24 జులై 2018 (15:20 IST)
కొవ్వు కరగాలంటే.. పరగడుపున బొప్పాయి పండ్లను తినాల్సిందే అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. శరీరంలోని కొవ్వు తగ్గాలంటే.. పరగడుపున అరకప్పు బొప్పాయి ముక్కల్ని తీసుకోవాలి. ఇలాచేస్తే బరువు తగ్గడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలుచేసిన వారవుతారు.


అధిక కొవ్వు తగ్గించడంలో ఉల్లిపాయలు మంచి మందులా పనిచేస్తాయి. అందుకే ఉల్లిపాయలు రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకునేలా చూడాలి. అలాగే కొవ్వు కరగాలంటే.. పండ్లలో యాపిల్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులోని పొటాషియం, ఫాస్పరస్‌ చాలా మేలు చేస్తుంది.
 
ఇంకా ఓ రోజులో ఓ అరటి పండు తప్పక తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అరటిలోని కెరోటోనిన్‌ అనే పదార్థం మానసిక వ్యాకులతను దూరంచేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. బరువు తగ్గాలంటే.. రెడ్ మీట్‌ను పక్కనబెట్టి.. చేపలు తీసుకోవాలి. ఇందులోని ఒమేగా త్రీ ఫ్యాట్స్ గుండెపోటును అరికడుతుంది.
 
ఇకపోతే.. గుండెకు అవసరమయ్యే ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ గోధుమలో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే కొవ్వుని నివారిస్తుంది. ఫైబర్‌ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది. ఇంకా ఫైబర్‌ దొరికే పదార్థాలలో ఓట్స్‌, బార్లీ, రాగి, జొన్న వంటివి ముఖ్యమైనవి. వీటిని వారానికి మూడుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు