ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది.
రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది
ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.