వర్షాకాలంలో.. విరేచనాల నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నారా?

శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (09:53 IST)
వర్షాకాలం వచ్చిందంటే.... వాతావరణంలో మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. సీజనల్ వ్యాధుల ప్రభావం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షంతో పాటు వైరస్, అంటు రోగాలు, బ్యాక్టీరీయాలు కూడా మూకుమ్మడిగా దాడి చేస్తాయి. వీటి వల్ల విరేచనాల బారిన పడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విరేచనాలు తగ్గడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో ఇప్పుడు చూద్దాం....
 
ఆపిల్ పండ్లను తీసుకోని గుజ్జుగా చేసుకుని దానిలో  చెంచా నెయ్యి, చిటికెడు యాలకులు, జాజికాయ పొడిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని రోజూ తింటే విరేచనాలు తగ్గుతాయి.
 
నిత్యం లభించే అరటి పండ్లలో పోటాషియం ఎక్కువగా వుంటుంది. కాబట్టి విరేచనాలు పూర్తిగా తగ్గుతాయి. అరటి పండ్లను అలాగే తీసుకోకుండా ముక్కలు ముక్కలుగా చేసి వాటిపై నెయ్యి వేసి, చిటికెడు యాలకులు, జాజికాయ పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది.
 
విరేచనాలతో తీవ్రంగా బాధపడితే ఒక గ్లాసు నీటిలో సోంపు పొడి, అల్లం పొడి కలిపి తాగితే విరేచనాలు తగ్గుముఖం పడుతుంది.
 
బ్లాక్ కాఫీలో ఏలకులు, నిమ్మరసం, జాజికాయ పొడిని కలిపి తాగినా కూడా ఉపశమనం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు