ఆ పని చేసిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్.. ఎందుకు?

గురువారం, 19 సెప్టెంబరు 2019 (12:42 IST)
కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌లో ప్రయాణించారు. తద్వారా తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ యుద్ధవిమానం గురువారం ఉదయం 9.58కి బెంగళూరులోని హెచ్ఏఎల్ నుంచి బయల్దేరి 30 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. 
 
కాగా బయల్దేరే ముందు 45 స్క్వాడ్రన్‌ ఫ్లయింగ్ డాగర్స్‌కు చెందిన పైలట్లు విమానం గురించి రాజ్‌నాథ్‌కు పరిచయం చేశారు. ఏవియానిక్స్, నియంత్రణ, రాడార్, గ్లాస్ కాక్‌పిట్లతో పాటు యుద్ధంలో ఇది మోసుకు పోయే ఆయుధాలను కూడా వివరించారు.
 
ఈ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన తర్వాత రాజ్‌నాథ్ స్పందిస్తూ, 'యుద్ధ విన్యాసానికి సన్నద్ధమయ్యా' అని వ్యాఖ్యానించారు. జీ-సూట్ వేసుకున్న ఫొటోలు షేర్ చేశారు. కాగా, విమానంలో చక్కర్లు కొట్టిన అనంతరం డీఆర్‌డీవో చీఫ్ డాక్టర్ సతీశ్ రెడ్డితో కలిసి రాజ్‌నాథ్ సింగ్ మీడితో మాట్లాడారు. 
 
'కొద్దిసేపు రక్షణమంత్రి కూడా తేజస్‌ని నియంత్రిస్తూ నడిపించారు' అని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రాజ్‌నాథ్ కలగజేసుకుంటూ.. 'పైలట్ తివారీ ఎలా చెబితే అలా నడుపుతూ వచ్చాను.. ఏ సమస్యా ఎదురు కాలేదు' అని అని పేర్కొనడంతో అందరి ముఖంలో నవ్వులు విరిశాయి. 

 

भारत की शान

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు