భగవద్గీత అనే అద్దం ముందు నిలబడితే మనపైన మనకొక స్పష్టత వస్తుంది. అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం లభించి మనం ఆచరించవలసిన కర్తవ్యం బోధపడుతుంది. ఇది దేశ కాల జాత్యాదులకతీతం గా, మతాలకతీతం గా బోధించబడిన జీవన గీత. మరణ గీత కాదు. దీనిని బాల్యదశనుండే అభ్యసించాలి." అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి.
'ప్రపంచశాంతి కొరకు గీతా ప్రచార యాత్ర' లో భాగం గా అమెరికా లోని సిన్సినాటి లో ని ఇస్కాన్ దేవాలయం లో (12. 7. 2025) జరిగిన గీతా ప్రవచనం లో -నిత్య జీవితం లో గీత ఆవశ్యకత గురించి వివరించారు. విశ్వరూపసందర్శన యోగ ఘట్టాన్ని కళ్ళకి కట్టినట్టు గా తాత్పర్యసహితం గా గంగాధర శాస్త్రి గానం చేశారు. అందరితో కృష్ణ భజన చేయించారు.
కార్యక్రమం ముందు చిన్నారులు చేసిన భక్తియోగ పారాయణను, నాట్యం చేసిన చి II విద్యాసాంజలి రామినేని, చి II శ్రీధ వరాళి చదలవాడ లనూ అభినందిస్తూ భగవద్గీతా ఫౌండేషన్ తరఫున వారికి గంగాధర శాస్త్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. డాII వేదాంతం రామానుజా చార్యుల చేయూతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమాన్ని అత్యంత రంజకం గా నిర్వహించిన ప్రసిద్ధ గేయ రచయిత శ్రీ రమాకాంతారావు ను, ఆత్మీయ ఆతిధ్యాన్ని అందించిన శ్రీ అశోక్, శ్రీమతి దివ్యశ్రీ మల్లెంపాటి లను, కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన శ్రీ రామినేని అయ్యన్న చౌదరి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి చేసిన సత్కారం లో శ్రీ రమాకాంతరావు కంద పద్యాలతో రచించిన ప్రశంసా పత్రాన్ని శ్రీ భట్టు యద్దనపూడి చదివి వినిపించారు. కార్యక్రమానంతరం శ్రీ రాఘవేంద్ర తాడిపర్తి, శ్రీమతి అపర్ణ, శ్రీ ఈశ్వర్, డా వేదాంతం చారి ల గృహాలలో ఆతిథ్యం స్వీకరించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భం గా Mr. Jay, Mr. Kyle లు భారతీయ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు గంగాధర శాస్త్రి ని కలిసారు