శ్రీకృష్ణుడిని అలా నాలుగుసార్లు పిలిస్తే చాలు..?

శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (14:55 IST)
శ్రీకృష్ణుడు సైకాలజిస్ట్ అనొచ్చు. మన మనస్సుకు శ్రీకృష్ణుడు చికిత్స చేసేవాడు. గీత ద్వారా మానవులకు మానసిక స్థైర్యాన్నిచ్చాడు. అర్జునుని నెపంగా పెట్టుకుని పరమాత్ముడైన శ్రీకృష్ణునికి మానవులకు చెప్పిన మానసిన ప్రబోధమే భగవద్గీత. లోకంలో జరిగే విషయాలతో నిరంతం చింతిస్తూ వుంటే బుద్ధి నాశనానికి హేతువు అవుతుంది.


లౌకిక విషయాల పట్ల తాపత్రయ పడే వారు గుర్తించుకోవాల్సింది.. ఏంటంటే.. మనస్సును దేనితో ఎంతమేరకు అంటించాలో తెలుసుకోవాలి. అప్పుడు శాంతిగా వుండగలుగుతారు. ఇది ఇహానికి, పరానికి పనికి వచ్చే అద్భుతమైన మార్గం. దేని గురించి ఆలోచించాలో... దాన్ని మాత్రమే ఆలోచించాలి. 
 
అన్నీ విషయాలపై చింతన చేస్తే దుష్ఫ్రభావం తప్పదని శ్రీకృష్ణుడు గీతలో పేర్కొని వున్నాడు. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. అంతేగాకుండా మానసిక ప్రశాంతత కోసం.. ఉదయం నిద్రలేచిన వెంటనే ''హరి'' అని స్తుతించాలి. బయటికి వెళ్లేటప్పుడు.. ''కేశవా'' అంటూ స్మరించుకోవాలి. భోజనం చేసేటప్పుడు ''గోవిందా'' అంటూ స్తుతించాలి. రాత్రి నిద్రించే ముందు ''మాధవా'' అంటూ శ్రీకృష్ణునిని గుర్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఆండాళ్ తిరుప్పావైలో పేర్కొనబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు