తిరుమల తిరుపతి దేవస్ధానం ఆద్వర్యంలో 25న తిరుపతిలోని కోదండ రామాలయంలో పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ పుష్పయాగానికి సంబంధించిన గోడ పత్రికలను టిటిడి తిరుపతి జేఈవో పోలా భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్పయాగం ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలలోపు జరుగుతుందని చెప్పారు. 24న అంకురార్పణ జరగుతుందన్నారు.