సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (10:54 IST)
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో వాహన మండపం నుంచి మాడల వీధులలో స్వామి విహారానికి బయలుదేరారు. 
 
సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, తితిదే పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి