పూర్వకాలంలో మన పెద్దలు రాగిపాత్రల్లో ఆహారాన్ని భుజించేవారు. రాగి చెంబులు, గ్లాసుల్లో నీటిని తాగేవారు. ఆ రాగి చెంబులు, గ్లాసులు, అన్నం ప్లేట్లు ఇపుడు కంటికి కూడా కనిపించడం లేదు. దీనికి కారణం నానాటికీ మారిపోతున్న జీవనవిధానమే.
* రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అసిడిటీ, అజీర్ణం, డయేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
* అందుకే పెద్దలు అంత ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ రోజులు జీవించారని నిపుణులు చెబుతున్నారు.
* సో.. ఇప్పటికైనా రాగి, ఇత్తడి పాత్రలు వాడడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వారు చెబుతున్నారు.