ప్రపంచ కప్ ఫైనల్స్: జహీర్ ఖాన్ బంతికి తరంగ అవుట్!

భారత్-శ్రీలంకల మధ్య ప్రపంచకప్ ఫైనల్ పోరు ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 6.1 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలర్లు లంకేయుల బ్యాట్స్‌మెన్లకు తమ అద్భుత బౌలింగ్‌తో చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ ఉప్పల్ తరంగను కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జహీర్ ఖాన్ పెవిలియన్ దారిపట్టించాడు.

ప్రస్తుతం దిల్షాన్ (13), కెప్టెన్ కుమార సంగక్కర (1)లు క్రీజులో ఉన్నారు. ఫలితంగా 6.3 ఓవర్లలో శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు సాధించింది. జహీర్ ఖాన్ తన ఖాతాలో ఒక వికెట్‌ను సాధించడం ద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అగ్రస్థానాన్ని మరో రెండు వికెట్ల దూరంలో నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి