మహేల జయవర్ధనే అర్థశతకం: శ్రీలంక స్కోరు 162/3

భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 49 బంతులాడిన మహేల జయవర్ధనే ఆరు ఫోర్లతో 50 పరుగులు సాధించాడు. తద్వారా ప్రపంచకప్‌లో ఆరో హాఫ్ సెంచరీని, వన్డే కెరీర్‌లో 57వ అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

అంతకుముందు తొలుత టాస్ గెలిచిన శ్రీలంక 120 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జయవర్ధనే (60), సమరవీర (18)లు క్రీజులో ఉన్నారు. ఫలితంగా శ్రీలంక 36.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, భజ్జీ, యువరాజ్ సింగ్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు పడగొట్టాడు.

వెబ్దునియా పై చదవండి