తీసుకోవలసిన పదార్థాలు: కొత్తిమీర - రెండు కట్టలు, మెంతులపొడి - ఒక టీ స్పూను, చింతపండు - 1/4కేజి, కారం - రెండు కప్పులు, నూనె - 300 గ్రా, ఉప్పు - రెండు కప్పులు.
ఇలా తయారు చేయండి: కొత్తిమీర కట్టను సన్నగా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి స్టౌమీద బాగా ఉడికనిచ్చి.... అందులో ఉప్పు కూడా వేయాలి. ఉడికిన చింతపండును దించి కొంత సేపు ఆరనిచ్చి తర్వాత దానిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
అనంతరం స్టౌమీద బాణలి వేడయ్యాక నూనె పోసిన కాసేపటి తర్వాత అప్పటికే సన్నగా తరిగిన కొత్తిమీరను అందులో వేసి వేయించాలి. ఇప్పుడు ఒక పళ్లెంలో చింతపండు రసం, కారం వేగిన కొత్తిమీర ఆకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి ఇప్పటికే మనం వేయించిన కొత్తిమీర తరుగును కలిపి మళ్లీ స్టౌమీద వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ తాళింపును తడిలేని సీసాలోకి తీసుకుని భద్రపరుచుకుంటే సరిపోతుంది.