కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం.. పావు కేజీ శెనగపప్పు... ఒక కప్పు కొబ్బరికాయ.. ఒకటి పంచదార.. 400 గ్రా. ధనియాలు.. ఒక టీ. యాలకులు.. ఆరు లవంగాలు.. నాలుగు బాదం.. పది పిస్తా.. పది ఎండుద్రాక్ష.. పది చిరోంజి పప్పు.. ఒక టీ. నెయ్యి.. వంద గ్రా. ఫుడ్ కలర్.. కాస్త రోజ్ ఎసెన్స్.. కొద్దిగా
తయారీ విధానం : బియ్యం కడిగి గంటసేపు నానబెట్టాలి. ఆపై నీళ్లు వంపేసి అరగంటసేపు ఆరబెట్టాలి. బాదం, పిస్తా నట్స్ అన్నింటినీ నేతిలో వేయించి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. కొబ్బరిని కూడా వేయించాలి. ప్రెషర్పాన్లో 4 టీస్పూన్ల నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, బియ్యం వేసి లేత బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. తరువాత అందులోనే కొబ్బరి వేసి బియ్యం కొలతకన్నా ఒకటిన్నరరెట్లు ఎక్కువ ఉండేలా నీళ్లు పోసి ఉడికించాలి.
శెనగపప్పు, పంచదార, వేయించిన నట్స్, ఎండుద్రాక్ష, ఫుడ్ కలర్ అన్నింటిని కూడా కొబ్బరి మిశ్రమంలో వేసి కలిపి తక్కువ మంటమీద ఉంచి మూత పెట్టాలి. పంచదార కరిగి అన్నం ఆ పాకాన్ని పీల్చుకునేవరకూ అలాగే ఉంచి దించేయాలి. ఎసెన్స్ చల్లి, నెయ్యి వేసి కలపాలి. చివరగా మరికాస్త కొబ్బరి, నట్స్తో అలంకరించి వడ్డిస్తే సరి..!