కావలసిన పదార్థాలు : పచ్చిబఠాణీలు... అరకేజీ పనీర్... పావు కేజీ ఉల్లిపాయలు... పావు కేజీ టొమోటో.. పావు కేజీ కొత్తిమీర... ఒక కట్ట పసుపు... ఒక టీ. కారం... ఒక టీ. గరంమసాలా... రెండు టీ. అల్లంవెల్లుల్లి... రెండు టీ. ఉప్పు... తగినంత నూనె... సరిపడా
తయారీ విధానం : పనీర్ను ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక... అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి కాసేపు వేయించి, ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమరంగులోకి వచ్చేదాకా వేయించాలి. అందులోనే టొమోటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి, అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి.
నీళ్లన్నీ ఇగిరిపోయేదాకా ఉడికిన తరువాత... పచ్చిబఠాణీలను కూడా వేసి అవి మునిగేదాకా మళ్లీ నీటిని పోసి కారం, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. బఠాణీలు మెత్తగా ఉడికిన తరువాత పనీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. కూర దగ్గర పడుతుండగా, చివర్లో గరంమసాలా పొడి చల్లి దించేయాలి. అంతే పచ్చిబఠాణీ పనీర్ కర్రీ తయారైనట్లే...!!