కావలసిన పదార్థాలు : కాస్త పెద్దగా ఉన్న వంకాయలు - మూడు, చింతపండు రసం - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - తగినంత, పసుపు - కాస్త, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయలు - రెండు, నూనె - రెండున్నర చెంచాలు. తిరగమాతకు కావలసినవి : ఆవాలు - చెంచా, మెంతులు - అర చెంచా, ఎండుమిరపకాయలు - మూడు.
తయారు చేయు విధానం : ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వంకాయలను స్టవ్ మీద కాల్చి తోలు తీసి రోట్లో తొక్కి పెట్టుకోవాలి. చింతపండు రసంలో దీనిని ముంచాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, మెంతులను వేయాలి ఇందులో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి. దీనిని వంకాయ గుజ్జును వేసిన చింతపండు రసంలో వేసి ఉప్పు, పసుపులను కూడా వేసి వేడి వేడిగా వడ్డించాలి.