ఉప్పు, నూనె.. సరిపడా
తయారీ విధానం :
ముందుగా వేడినీటిలో పాలకూర ఆకుల్ని వేసి తీసేయాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా మగ్గించాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు, పసుపు చేర్చి మరికాసేపు సన్నని మంటపై ఉంచాలి. చివర్లో ఉప్పు, సేమియా, కొత్తమీర కలిపి పాత్రను దించేయాలి. ఈ మిశ్రమాన్ని పాలకూర ఆకుల్లో ఒక్కో టీస్పూన్ చొప్పున ఉంచి గుండ్రంగా చుట్టి ఉంచాలి.
ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి చుట్టి ఉంచిన పాలకూర ఆకుల్ని ఉంచి నిమిషంపాటు రెండువైపులా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి మసాలా పాలక్ కర్రీ రోల్స్ తయారైనట్లే. ఇవి చపాతీలతోనూ, అన్నంతోనూ కలిపి తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.