కావలసిన పదార్థాలు : బియ్యం.. 400 గ్రా. ఉప్పు.. తగినంత నూనె.. 3 టీ. ఆవాలు.. అర టీ. కరివేపాకు.. కొద్దిగా పచ్చిమిరప.. 2 ఉల్లితరుగు.. అర కప్పు టొమోటో ముక్కలు.. రెండు కప్పులు కారం.. ఒకటిన్నర టీ. కొత్తిమీర.. కాస్తంత
తయారీ విధానం : అన్నం పొడిగా వండాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేయాలి. చిటపటలాడాక కరివేపాకు, పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేయాలి. మూత పెట్టి సన్నటి సెగపై నాలుగు నిమిషాలుంచాలి. మూత తీసి అందులో నీళ్లు ఇంకే వరకూ వేయించాలి. ఈ మిశ్రమాన్ని వండిన అన్నంలో కలపాలి. కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి తక్కాలి సాదం రెడీ..! దీన్ని వెజిటబుల్ సలాడ్తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.