ఆ ముగ్గురికీ అవకాశాలు ఉన్నాయ్..!

ఆదివారం, 3 జూన్ 2007 (18:52 IST)
భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)తో విభేదించిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఇంకా అవకాశాలు ఉన్నట్టు ఏపీ బ్యాడ్మింటన్ సంఘం పేర్కొంది. రాష్ట్రానికి చెందినచేతన్ ఆనంద్, గుత్తా జ్వాల, శ్రుతి కురియన్‌లు స్వయంగా బాయ్‌ను సంప్రదిస్తే మాత్రం వారిని శిక్షణ శిబిరానికి అనుమతిస్తామని ఏపీ బాయ్ ప్రకటించింది.

అయితే.. బాయ్‌కు, కొంత మంది క్రీడాకారుల మధ్య విభేదాలు తలెత్తడానికి కొందరు మాజీ క్రిడాకారులో కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయతే బాయ్‌తో విభేదించిన ముగ్గురు ఆటగాళ్లు చీఫ్ కోచ్‌ గోపీచంద్‌తో ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని ఏపీ బాయ్ అధికారులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి