అమెరికాకు స్వైన్ ఫ్లూ కారణంగా పెనుముప్పు పొంచివుందని ఆ దేశ అధ్యక్ష భవనం ఓ నివేదికలో వెల్లడించింది. ప్రమాదకర ఎ(హెచ్1ఎన్1) ఫ్లూ కారణంగా అమెరికాలో 90 వేల మంది పౌరుల ప్రాణాలు బలిగొనే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా రెండు మిలియన్ల మంది పౌరులు ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వైట్హోస్ నివేదిక పేర్కొంది.
2009 చివరినాటికి 60 నుంచి 120 మిలియన్ల మంది అమెరికన్లు స్వైన్ ఫ్లూ లక్షణాల బారినపడే అవకాశం ఉందని వైట్హోస్ వెల్లడించింది. వీరిలో 1 నుంచి 2 బిలియన్ల మంది ఆస్పత్రి పాలయ్యే అవకాశం ఉందని తెలిపింది. వీరిలో 1,50,000- 3,00,000 ఐసీయూల్లో చికిత్స అందించాల్సి వస్తుంది.
వీరిలో 30 వేల నుంచి 90 వేల మంది వరకు స్వైన్ ఫ్లూకి బలయ్యే ప్రమాదం ఉందని వైట్హోస్ హెచ్చరించింది. వీరిలో ఎక్కువ మంది 50 ఏళ్ల వయసులోపు వారే అయివుంటారని ఈ నివేదిక పేర్కొంది. అమెరికా జనాభాలో 20 శాతం నుంచి 40 శాతం మంది పౌరులు స్వైన్ ఫ్లూ లక్షణాల బారినపడే ప్రమాదం ఉంది.
అమెరికాలో సాధారణంగా ప్రతి ఏటా శీతాకాలంలో సాధారణ ఫ్లూ బారినపడే 35 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఈసారి స్వైన్ ఫ్లూ ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అమెరికా సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.