అమెరికాకు భారత్‌ మంచి దోస్త్ : సెనేటర్ జాన్

అమెరికా దేశానికి భారత దేశం మంచి దోస్త్‌ అని ఆ దేశ సెనేటర్, సెనేట్ ఇండియా కాకస్ కో ఛైర్మన్ జాన్‌ కార్నన్ చెప్పారు. భారతదేశం 63వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అమెరికాలోని ప్రవాస భారతీయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవలి కాలంలో అమెరికా-భారత దేశాలమధ్య దౌత్యసంబంధాలు పటిష్టంగా ఉన్నాయని, తమ సంబంధాలు మరింత గట్టిపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో తాము భారతదేశంతో మైత్రీ బంధాలను మరింత పటిష్టం చేసి వ్యాపార పరంగాకూడా అభివృద్ధి జరిగేలా ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి