అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో నిర్బంధించడం ద్వారా తనకు జరిగిన అవమానంపై భారత్లో పెద్దఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవద్దని అభిమానులకు సూచించారు. దీనిని ఇంతటితో వదిలిపెట్టాలన్నారు.
భారత్లో అమెరికాకు వ్యతిరేకంగా సోమవారం నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. అమెరికా జాతీయ పతకాన్ని నిరసనకారులు దహనం చేశారు. ఈ నేపథ్యంలో.. షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని అభిమానులను కోరారు. ఇదిలా ఉంటే అమెరికా మరింత ప్రేమను పంచాల్సిన అవసరం ఉందన్నాడు.
అంతేకాకుండా ఆ దేశ అధికారిక ప్రక్రియలు మరింత వేగంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డాడు. భారత్ నుంచి నెవార్క్ విమానాశ్రయానికి వెళ్లిన షారుఖ్ ఖాన్ను శనివారం అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు రెండు గంటలపాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్లో నిరసనలు వెల్లువెత్తాయి.
ఆసియావాసి కావడం, పేరులో ఖాన్ ఉన్న కారణంగా అమెరికా యంత్రాంగం షారుఖ్ను నిర్బంధించిందని ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. విదేశీయులు ఆ దేశానికి వెళ్లిన సందర్భంగా పాటించాల్సిన ప్రక్రియలను తాను గౌరవించాలని షారుఖ్ ఖాన్ తెలిపారు. అయితే తనకు అక్కడ ఎదురైన అనుభవం మాత్రం సంతృప్తికరంగా లేదని తాజాగా ఈ బాలీవుడ్ సూపర్స్టార్ చెప్పారు.