ప్రస్తుతం తమ ప్రభుత్వం ఒసామా బిన్ లాడెన్ మరియు అల్ జవాహిరీలాంటి ప్రముఖ అల్ఖైదా నేతలపై తీవ్రమైన నిఘా పెంచి ఒత్తిడి తీసుకు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ఒరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు.
తాము ఆఫ్గనిస్థాన్పై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఒబామా ఓ రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ వైట్హౌస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
రేడియోకిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ... ఒసామా బిన్ లాడెన్, అల్ జవాహరీకి చెందిన అనుయాయులను తమ సైనికులు అంతం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో వారి స్థావరాలనుంచి తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
ఇదిలావుండగా ఆఫ్గన్ ప్రాంతాలలో తల దాచుకుని ఉన్న అల్ఖైదా ప్రముఖ నేతల స్థావరాలపై పాకిస్థాన్ సైన్యం దాడులు ముమ్మరం చేస్తున్నాయని, ఈ కారణంగానే బైతుల్లా మెహసూద్ డ్రోన్ దాడుల్లో మృతి చెందారని ఆనయ తెలిపారు.
కాగా ఒసామా బిన్ లాడెన్ను తప్పకుండా పట్టుకుని తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి తాము తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.