ఆఫ్ఘనిస్థాన్: నాటో దళాలపై ఆత్మాహుతి దాడి

ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో సోమవారం నాటో దళాలను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్థాల నింపిన వాహనంలో వచ్చి నాటో దళాల కాన్వాయ్‌కు అతి సమీపంలో తననితాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు తెలిపారు.

కుందుజ్ నగరం నడిబొడ్డున ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావీన్స్ రాజధానిలో సోమవారం ఉదయం నాటో నేతృత్వంలోని బెల్జియం దళాలు కాన్వాయ్‌లో వెళుతుండగా ఆత్మాహుతి దళ సభ్యుడొకరు ఈ దాడి చేశాడని ప్రావీన్స్ పోలీసు చీఫ్ అబ్దుల్ రజాక్ తెలిపారు. దాడిలో సైనికులు లేదా పౌరులెవరూ మృతి చెందలేదు.

ఆత్మాహుతి దళ సభ్యుడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే తాలిబాన్ ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ ఈ దాడి తామే చేశామని, దాడిలో పాల్గొన్న మొహిబుల్లా తమ తీవ్రవాదేనని చెప్పాడు. పేలుడులో 10 మంది జర్మనీ సైనికులు మృతి చెందినట్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి