కజకిస్థాన్‌లో అగ్నిప్రమాదం: 38 మంది మృతి

ఆదివారం, 13 సెప్టెంబరు 2009 (15:21 IST)
కజకిస్థాన్‌ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. డాల్టికోరన్ అనే నంగరంలోని ఒక ఆస్పత్రిలో ఆదివారం జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 38 మంది అగ్ని కీలాల్లో చిక్కుకుని ఆహుతయ్యారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ అగ్నిప్రమాదం తెల్లవారుజామునే ఏర్పడటం వల్ల అనేక మంది నిద్రమత్తులో ఉన్నారని, అందువల్ల నిద్రలోనే మృత్యువాత పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. కజకిస్థాన్‌ దేశంలో గత యేడాదిలో సుమారు పది వేలకు పైగా అగ్నిప్రమాదాలు జరిగినట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి