జాతి వివక్ష దాడులు: భద్రతపై కృష్ణ హామీ

భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఆస్ట్రేలియా పర్యటన గురువారం ప్రారంభమైంది. ఆయన పర్యటన ఐదు రోజులపాటు సాగనుంది. ఆస్ట్రేలియా వచ్చిన సందర్భంగా ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో విదేశాల్లో భారతీయుల భద్రత కూడా ఒకటని తెలిపారు.

ఇటీవల ఆస్ట్రేలియాలో వరుసగా భారతీయ విద్యార్థులపై జాతి వివక్ష దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఎం కృష్ణ ఆస్ట్రేలియాలోని భారతీయ సంఘంతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయ సమాజానికి సరైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. తమపై దాడులు చేస్తున్న వారిపై మరిన్ని చర్యలు చేపట్టేలా ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణకు ఆస్ట్రేలియా భారతీయ విద్యార్థుల సమాఖ్య (ఎఫ్ఐఎస్ఏ) సభ్యులు విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి