తూర్పు చైనాలో మొరాకోత్ తుపాను భీభత్సం

చైనా తీర్పు తీర ప్రాంతంలో మొరాకోత్ తుపాను భీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా సుమారు పది లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. వీరందరినీ అధికారిక యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. వేలాది ఇళ్లు తుపాను తాకిడికి నేలమట్టమయినట్లు అధికారులు తెలిపారు.

మొరాకోత్ తుపాను కారణంగా చైనా కంటే ముందు తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా భారీగా నష్టపోయాయి. తైవాన్‌లో గత 50 ఏళ్లలోనే తొలిసారి భారీ స్థాయిలో తుపాను కారణంగా వరదలు సంభవించాయి. పదుల సంఖ్య పౌరుల ఆచూకీ గల్లతైంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య స్పష్టంగా తెలియరాలేదు. తుపాను తీవ్రతకు ఓ ఆరు అంతస్తుల హోటల్ పూర్తిగా నేలమట్టమైంది.

ఫిలిప్పీన్స్‌లో తుపాను కారణంగా 21 మంది పౌరులు మృతి చెందారు. ఆదివారం ఈ తుపాను చైనాలో విలయతాడవం చేసింది. చైనాలోని ఫుజియన్ ప్రావీన్స్‌లో తుపాను కారణంగా భారీ వర్షాలు కురవడంతోపాటు, గంటకు 74 మైళ్ల (119 కిలోమీటర్లు) వేగంతో గాలులు వీచాయి. జెజియాంగ్ ప్రావీన్స్‌లో ఇళ్లు కూలిపోయి ఒకరు మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి